Home
About
Contact
Home-icon
TG News
AP NEws
National News
Film News
Spriritual
Others
Mega Menu
Contact Us
Post a Comment
0 Comments
Report Abuse
*శ్రీశైలం ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు**దీక్ష పూర్తిచేసి ఇరుముడితో శివయ్య దర్శనానికి వచ్చిన స్వాములపై లాఠీచార్జ్**భక్తులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంపై NHRCకి ఫిర్యాదు చేసిన సీనియర్ న్యాయవాది**పోలీసులు, ఆలయ పాలక మండలిపై ఫిర్యాదు చేసిన నంద్యాల సీనియర్ న్యాయవాది ఫణీంద్ర నాథ్*
February 10, 2026
*మీడియా పై మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నాం* *డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU)*సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU) రాష్ట్ర కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం.మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి.మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదు. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU )*కే రాజేంద్ర ప్రసాద్**రాష్ట్ర అధ్యక్షులు**బొడ్డు అశోక్* *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*88979 61644
December 10, 2024
*రాయచోటి పట్టణంలో హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలి**రాయచోటి పట్టణం ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి**రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి**పట్టణంలో గొడవలు జరిగితే కఠిన చర్యలు* *జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు**రాయచోటి, డిసెంబర్ 7:-*రాయచోటి పట్టణంలో హిందూ ముస్లింలు సోదర భావంతో మెలిగి ఎటువంటి గొడవలకు చోటు ఇవ్వరాదని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...రాయచోటి పట్టణంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న గొడవలను దృష్టిలో ఉంచుకొని హిందూ ముస్లిం సోదరులతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో హిందూ ముస్లింలు ఒకరికొకరు సోదర భావంతో మెలగాలని ఎటువంటి కండిషన్లు లేకుండా నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజులలో ఎవరికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా అధికార యంత్రాంగం తరపున గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఇందుకు సంబంధించి నాలుగైదు రోజుల తర్వాత రెండు వర్గాల మత పెద్దలను పిలిపించి మరొక పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పీస్ కమిటీ సమావేశంలో ఇకనుంచి పట్టణంలో ఎటువంటి గొడవలకు తాగు లేకుండా శాశ్విత పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు.జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.... రాయచోటి పట్టణంలో ఎటువంటి గొడవలు జరిగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పట్టణంలో కొంతమంది ఆకతాయిలు గొడవలు సృష్టిస్తున్నారని అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాత్రి 10:30 గంటల తర్వాత అత్యవసర పరిస్థితులలో తప్ప అనవసరంగా ఎవరు బయట తిరగకూడదన్నారు. రాయచోటి పట్టణం ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టడం జరిగిందన్నారు. పట్టణంలో ఎటువంటి చిన్న సమస్యలు కూడా తలెత్తకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్ పుల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వాసు బాబు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
December 07, 2024
Subscribe Us
Most Popular
Labels
APNews
2
FilmNews
1
https://youtu.be/b_xXBfS_Yjg?si=_e1sheR03RYhCA9Q
1
NationalNews
1
Others
1
Spiritual
1
TGNews
1
Contact form
0 Comments