Home
About
Contact
Home-icon
TG News
AP NEws
National News
Film News
Spriritual
Others
Mega Menu
Responsive Advertisement
Home
https://youtu.be/b_xXBfS_Yjg?si=wVbEUc5yoUzRTwJT
https://youtu.be/b_xXBfS_Yjg?si=wVbEUc5yoUzRTwJT
yuddham2022 avineethipai
June 08, 2024
https://youtu.be/b_xXBfS_Yjg?si=wVbEUc5yoUzRTwJT
Post a Comment
0 Comments
Responsive Advertisement
Report Abuse
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్గా సీహెచ్. శ్రీదత్ను నియమించింది. ఆయనకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్గా ఎం.వి.శేషగిరి, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్శాఖ కమిషనర్గా రేఖారాణి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్గా చేవూరి హరికిరణ్ నియమితులయ్యారు.రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగ్లుమైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్గా సి.హెచ్.శ్రీదత్సి.హెచ్.శ్రీదత్కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలుస్టాంపులు, రిజిస్ట్రేషన్లు ఐజీ, కమిషనర్గా ఎం.వి.శేషగిరిహ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ కమిషనర్గా రేఖా రాణిప్రజారోగ్యం, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్గా చేవూరి హరికిరణ్నేషనల్ హెల్త్మిషన్ ఎండీగాను హరికిరణ్కు అదనపు బాధ్యతలుసెర్ప్ సీఈవోగా వీరపాండ్యన్మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్గా ఎం.హరినారాయణబీసీ సంక్షేమ డైరెక్టర్గా మల్లికార్జునబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషనర్గా మల్లికార్జునకు అదనపు బాధ్యతలుసాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శిగాను ప్రసన్నవెంకటేష్భూ సర్వే, సెటిల్మెంట్ల డైరెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావుసివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీగా గిరిశ్ షాఏపీ మార్క్ఫెడ్ ఎండీగా మంజీర్ జిలానీమంజీర్ జిలానీకి శాప్ ఎండీగా అదనపు బాధ్యతలుఇంటర్మీడియర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా కృతికా శుక్లాబోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గాను కృతికా శుక్లాకు అదనపు బాధ్యతలుఏపీ సీపీడీసీఎల్ సీఎండీగా రవిసుభాష్ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా లక్ష్మీ షాఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోగాను లక్ష్మీ షాకు అదనపు బాధ్యతలుమహిళాభివృద్ధి, శిశు సంక్షేమ డైరెక్టర్గా ఎం.వేణుగోపాల్రెడ్డిఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ పి.రాజబాబుఎక్సైజ్ శాఖ ప్రొహిబిషన్ డైరెక్టర్గా నిషాంత్కుమార్క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ మిషన్ ఎండీగా జి.సి. కిషోర్కుమార్అగ్రికల్చర్ మార్కెట్ శాఖ డైరెక్టర్గా విజయసునీతఉద్యానశాఖ డైరెక్టర్గా కె.శ్రీనివాసులుసాంఘిక, సంక్షేమ శాఖ డైరెక్టర్గా లావణ్య వేణిఏపీఐఐసీ ఎండీగా అభిషిక్త్ కిషోర్ఏపీటీడీసీ ఎండీగానూ అభిషిక్త్ కిషోర్కు అదనపు బాధ్యతలుసెకండరీ హెల్త్ డైరెక్టర్గా ఏ.సిరిఆర్ అండ్ ఆర్ కమిషనర్గా రామసుందర్రెడ్డికాడా కమిషనర్గా రామసుందర్రెడ్డిఏపీ ట్రాన్స్కో జాయింట్ ఎండీగా కీర్తి చేకూరిస్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా గణేష్కుమార్టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా గణేష్కుమార్పురపాలక శాఖ సంపత్కుమార్
July 20, 2024
అంగారక గ్రహంపైకి మరో ప్రయోగానికి సిద్దమవుతున్న ఇస్రో మంగళయాన్-2 మిషన్.సూర్యుడు, చంద్రుడిపై తర్వాత అంగారక గ్రహం యెక్క రహాస్యాలను అన్వేషించనున్నారు. అంగారకుడిపై మరో ప్రయోగానికి సిద్దమైంది ఇస్రో. మంగళయాన్-1 చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంగారక గ్రహంపైకి మరో ప్రతిష్టాత్మకమై ప్రయోగానికి సిద్దమైంది.మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ యొక్క సక్సెస్ తర్వాత, రెండవ ఎడిషన్ మార్టిన్ ఉపరితలంపై రోవర్ మరియు హెలికాప్టర్ను ల్యాండ్ చేయడం ద్వారా ఒక అడుగు ముందుకు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.స్పేస్ అప్లికేషన్ సెంటర్లో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మిషన్ సక్సెస్తో యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా తర్వాత అంగారక గ్రహంపై స్పేస్షిప్ను విజయవంతంగా ల్యాండ్ చేసిన మూడవ దేశంగా భారతదేశాన్ని నిలవనుంది.ఇస్రోకు చెందిన రోవర్ అంగారకుడిపైకి విప్లవాత్మకంగా చేరనుంది. ఎయిర్బ్యాగ్లు మరియు ర్యాంప్ల వంటి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించకుండా, రోవర్ అధునాతన స్కై క్రేన్తో మార్టిన్ ఉపరితలంపైకి సున్నితంగా లాండ్ చేయబడుతుంది. ఈ వ్యవస్థ సహాయంతో అంగారక గ్రహంపై గల క్లిష్టమైన భూభాగంలో కూడా సురక్షితమైన మరియు ఖచ్చితమైన ల్యాండింగ్ చేయవచ్చు. బహుశా రెండు దశాబ్దాల తర్వాత రెడ్ ప్లానెట్పై భవిష్యత్తులో మానవ ల్యాండింగ్ల కోసం ఈ పద్ధతి ఉపయోగించవచ్చు. వీటితో పాటు సూపర్సోనిక్ పారాచూట్ డెవలప్ చేశారు.అంగారక గ్రహం పలుచని వాతావరణాన్ని కలిగి ఉంది, ఇది భూమి కంటే 1% దట్టమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. దీని కారణంగా పురాతన పారాచూట్లు ఇక్కడ పనిచేయవు. ఒక వ్యోమనౌక అధిక వేగంతో అంగారకుడి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, దానికి సూపర్సోనిక్ పారాచూట్ అవసరం, ఇది వేగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది నియంత్రిత మరియు స్థిరమైన ల్యాండింగ్ చేసేందుకు దోహదం చేస్తుంది. ఘర్షణ కారణంగా ఏర్పడై తీవ్రమైన వేడిని తగ్గిస్తుంది. 2021లో రోవర్ ల్యాండింగ్ కోసం నాసా ఇదే విధానాన్ని ఉపయోగించింది.అంగారక గ్రహంపై ఎందుకంత ఆసక్తి?సౌర వ్యవస్థలో ఎన్నో గ్రహాలు ఉన్నప్పటికీ , అంగారక గ్రహంపైనే పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు ఎందుకు ఆసక్తి చూపుతున్నారో తెలుసా! వేసవిలో 20 డిగ్రీల సెల్సియస్ నుండి శీతాకాలంలో మైనస్ 73 డిగ్రీల సెల్సియస్ వరకు తీవ్రమైన ఉష్ణోగ్రత వైవిధ్యాలతో అంగారక గ్రహం చాలా ప్రతికూల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వివిధ స్పేస్ ఏజెన్సీలు పంపిన 50కి పైగా మిషన్లలో 50% కంటే సక్సెస్ రేటు ఉన్నప్పటికీ, అంతరిక్ష పరిశోధనలో మార్స్ చాలా ఎక్కువ దేశాలు లక్ష్యంగా చేసుకున్న గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది.అంగారక గ్రహంపై దృష్టి సారించడానికి గల మూడు ప్రధాన కారణాలు ఇవే !మనిషి అన్వేషకుడు3 Full stop కాబట్టి విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అంగారక గ్రహం, సౌర వ్యవస్థలో భూమిని పోలి ఉండే గ్రహం. దీంతో అంగారక గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకునేందుకు చేసే ప్రయోగాలకు ఒక అద్భుతమైన ప్రదేశం. అంగారక గ్రహం ఒకప్పుడు సమృద్ధిగా నీరు, నదులు, మంచి దట్టమైన వాతావరణాన్ని కలిగి ఉండి, నివాసయోగ్యమైనది ఉండేదని కొన్ని పరిశోధనలు తెలిపాయి.. Window Chrome, అంగారక గ్రహంపై ఉన్న శాస్త్రీయమైన ఆసక్తి. భూమిపై జీవం ఉన్నప్పుడు , మార్స్ తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటుంది. అంగారక గ్రహంపై అగ్నిపర్వతాలు, ఉల్క ప్రభావం క్రేటర్స్ మరియు ఇతర భౌగోళిక ప్రక్రియలను గురించి అధ్యయనం చేయడం వల్ల ఆ గ్రహం గురించి మరింత తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిశోధనల ద్వారా వాతావరణ నమూనాలు అంగారక గ్రహం యొక్క నిర్మాణం మరియు పరిణామం గురించి కీలకమైన వివరాలను తెలుసుకోవచ్చు. దీని ద్వారా భూ గ్రహాన్ని గురించి మరింత అర్థం చేసుకునేందుకు సహాయపడతాయి. అంగారక గ్రహ అన్వేషణకు రోబోటిక్ మిషన్లు ఉపయోగిస్తున్నారు. వీటి సహాయంతో భవిష్యత్తులో అంతరిక్షంలో పలు అన్వేషణల కోసం మనుషుల అవసరం ఉండదు మరియు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ మిషన్లు వనరుల లభ్యతను గుర్తించగలవు, అదే విధంగా గ్రహం మీద ఎదురయ్యే సవాళ్లను అంచనా వేయగలవు.
June 17, 2024
గూడూరు లో బాలయ్య బాబు జన్మదిన వేడుకలు.కేకు కట్ చేసి, బాణా సంచాకాల్చి సంబరాలుచేసిన బాలయ్య అభిమానులు.తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లో నందమూరి నటరత్నం, నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించడం జరిగింది. గూడూరు సాధుపేట సెంటర్ లో టీడీపీ పార్టీ జెండా స్తంభం వద్ద అభిమానులు బాలయ్య బాబు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, కేకు కటింగ్ చేశారు. జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. కాబోయే మంత్రి అంటూ జయ జయ ద్వానాలు చేశారు. బాణాసంచాకాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం చాకోలెట్స్, కేకు పంచిపెట్టారు. నాయకులు మాట్లాడుతూ, మా నందమూరి బాలయ్య బాబు, తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, తండ్రి తెలివితేటలూ, రాజకీయ చతురత పుణికిపుచ్చుకొని ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి బాలయ్య బాబు అన్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి వర్గం లో మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోయే మా బాలయ్య బాబు నిండునూరేళ్ళు సిరిసంపదలు ఆయురారోగ్యాలతో మరెన్నో పదవులు అలంకరించి కలకాలం జీవించాలని కోరుకుంటున్నాము అన్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో నరసింహులు నాయుడు, ధనుంజయ, రమేష్ నాయుడు, మోహన్ రెడ్డి, నడిపయ్య నాయుడు, మల్లిఖార్జున రెడ్డి, ప్రసాద్ నాయుడు, చంటి, కుమార్, రామయ్య, రాజా, అంకయ్య, భాస్కర్, బాలకృష్ణ అభిమానులు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.
June 10, 2024
Subscribe Us
Most Popular
Labels
APNews
2
FilmNews
1
https://youtu.be/b_xXBfS_Yjg?si=_e1sheR03RYhCA9Q
1
NationalNews
1
Others
1
Spiritual
1
TGNews
1
Contact form
0 Comments